గ్రూప్స్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ సిద్దిపేట కల్చరల్ ,జనవరి 25: స్థానిక టీఎస్ ఎస్సి స్టడీ సర్కిల్ లో గ్రూప్ 1,2,3,4, ఎస్సై, కానిస్టేబుల్, ఎస్సెస్సి, ఆర్ ఆర్ బి తదితర పోటీ పరీక్షలకు ఉచితంగా మూడు నెలలపాటు ఫౌండేషన్ కోర్సు ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు టీఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ ,ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు . ఫిబ్రవరి 10 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 17న దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంట్రన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేయబడిన 100 మంది అభ్యర్థులకు ఫిబ్రవరి 27 నుంచి మే 26 వరకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు వెబ్సైట్ www.tsscstudycircle.telangana.gov.in లో చూడాలని తెలిపారు. వివరాలకు ఫోన్ నెంబర్ 9553167760 లో సంప్రదించాలని తెలిపారు