Pages

Educational News

"ELIBRARY TELANGANA MOBILE APP RELEASED".

17 June 2019

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

🔳ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు.. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ జారీ 17-06-2019 02:40:00 25 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం 27న తొలి దశ సీట్ల కేటాయింపు హైదరాబాద్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీలతో పాటు ఇతర ప్రభుత్వ ఫండింగ్‌ ఆధారిత ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సంయుక్త సీట్ల కేటాయింపు సంస్థ (జోసా) ఆదివారం విడుదల చేసింది. విద్యార్థుల రిజిస్ట్రేషన్‌కు ఆదివారం నుంచే అవకాశం కల్పించింది. ప్రతిష్ఠాత్మకమైన 107 విద్యాసంస్థల్లో సీట్ల మిగులుకు అడ్డుకట్ట వేసేందుకు కౌన్సెలింగ్‌ ప్రక్రియను మొత్తం ఏడు దశల్లో పూర్తిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఆయా విద్యాసంస్థల్లో సీట్ల సంఖ్య, గత ఏడాది ఏయే బ్రాంచిలో ర్యాంకు కటాఫ్‌ అయ్యింది? తదితర వివరాలు జోసా అధికారిక వెబ్‌సైట్‌ www.josaa.nic.inwww.josaa.nic.in లో అందుబాటులో ఉన్నాయి. జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు రిపోర్ట్‌ చేసేందుకుగానూ దేశంలోని 18 ఐఐటీల్లో రిపోర్టింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

No comments:

Post a Comment