Pages
- Home
- CEC-DEGREE VIDEO LECTURES
- EPG PATASHALA MOOCS
- TSCPGET 2024, PG Entrance Previous E-Question Paperswith Answers
- CUET PG PQPA 2024 2023 PREVIOUS QUESTION PAPERS
- PG Entrance CPGET 2023 QP Answers
- PG Entrance CPGET 2022 QP Answers
- PG Entrance CPGET 2021
- Useful Employment and Educational Weblinks
- E CONTENT
- VIDYAMITRA
- SWAYAM
- PG Entrance Old Question Papers University ...
- COURSERA
- National Digital Library of India
- Open Access Books
- Pdf Drive
- NCERT TEXTBOOKS
- CBSE
- TSAT Competative Exams Video Lectures
- TS Dr BRAOU UG PG Lectures
- IGNOU
- UGC-MHRD
- UGC List of Universities
- General Knowledge Today
- Universities In Telangana Name of the U...
- National Science Library
- IASC
- Open Access Journals
- ShodhGanga-ETD Ph.D. Research Reports
- National Digital Library Epg Pathshala Free ...
- GOVT.OF TELANGANA
- TS E-MAASA PATRIKA
- TS Sahitya Academi
- TRC
- LPU
- E-Material Practice Bits O...
- NIOS
- NIOS INTER Sub. Lectures
- E-Journals 1 Access to Global online Research ...
- IIT-JAM
- NPTEL-IIT & IISC Lectures
- NIT's
- Spoken Tutorial IIT Bombay
- UGC NET
- GURUKUL
- NTA
- National Career Service-Employment
- UPSC
- UPSC Material
- TSPSC
- TS Employment
- Career in All Sectors -Guidance
- SSC
- RRB
- IISER
- NISER
- IBPS-Banking
- INDIA STATISTICS
- Job Updates
- SCERT
- తెలుగు వెలుగు
- KNOW INDIA
- TS-TOURISM
- RRRLF ISPOA e-Repositories
- Indian Culture
- TS Public LIBRARY
- About India
- Scholarships GOVT of India
- GNANKHOSH
- Global Video Lectures on all subjects
- E-BOOKS Devotional Personality development TTD
- OPEN LIBRARY
- Impact MOTIVATIONAL PERSONALITY DEVELOPMENT VIDEOS
- NPTEL ENGINEERING COURSES VIDEO LECTURES
- MGNCRE
- SAMACHAR
- A.DURGAPRASAD M.LI.Sc.,NET,SET,PGDCA,(Ph.D)LIBRAR...
- OER LIS
- NIPUNA
- E- Material All courses
- NT NIPUNA EDUCATION
- LIBRARY SCIENCE
- PhD Entrance Test QPA 2025 OU
Educational News
11 October 2024
మనిషి మర్మము తెలిపే తెలంగాణ రుబాయిలు-కళ్లెం ధనోజ
మనిషి మర్మము తెలిపే తెలంగాణ రుబాయిలు-కళ్లెం ధనోజ -భావవీణ monthly, 2024
నరసింహారెడ్డి గారు 1968 ఏప్రిల్ 6 వ తేదీన ఏనుగు కృష్ణారెడ్డి,లక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా,రామన్నపేట మండలం కల్లోనికుంట గ్రామంలో జన్మించారు. నరసింహారెడ్డి జన్మించిన మూడేళ్లకే తండ్రి కృష్ణారెడ్డి టి.బి. వ్యాధితో మరణించారు. తల్లి లక్ష్మమ్మ నరసింహారెడ్డిని తీసుకుని హైదరాబాద్ లోని తార్నాకకు వెళ్ళింది. అక్కడ ఇబ్బందులు ఎదురు కావడంతో చిట్యాలకు వచ్చి స్థిర పడింది.
నరసింహారెడ్డి చిట్యాలలో 10 వ తరగతి, రామన్నపేటలో ఇంటర్ పూర్తి చేశాడు. సికింద్రాబాద్ లోని సర్ధార్ పటేల్ కాలేజీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం, నల్గొండ నాగార్జున డిగ్రీ కళాశాలలో ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదివారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చేసి,
తెలుగు విశ్వవిద్యాలయంలో
ఎం. ఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు.
గజల్, రుబాయి కవితారూపాలు పారసీ భాష నుంచి ఉర్దూలోకి ప్రవేశించాయని కొందరు, అరబ్బీ నుంచి వచ్చాయని మరికొందరు అంటూ ఉంటారు. కసీదా, గజల్, కతా అనే మూడు రూపాలు అరబ్బీ, ఫారసీ రెండింటిలోనూ మొదటి నుంచి ఉన్నాయి. రుబాయి, మస్నవి ,తర్జీయా అనే మూడు రూపాలు ఫారసీలోనే ఉన్నాయి. ఉర్దూ గజళ్ళు, ఉర్దూ రుబాయిలు- అనువాదాల ద్వారానే మొదట తెలుగువారికి పరిచయమైనాయి. రుబాయి రచన ఎంత సులభమో మంచి రుబాయి నిర్మాణం అంత కష్టం. రుబాయిలో ప్రధానంగా ఒకే ఒక్క భావం ఉంటుంది .ఈ భావ ప్రసూనం నాలుగు రేకులుగా విచ్చుకుంటుంది.
1. మొదటి పాదంలో భావం మొగ్గతొడుగుతుంది.
2. రెండవ పాదంలో కొంచెం విచ్చుకుంటుంది.
3. మూడవ పాదంలో వినూత్న
అభివ్యక్తితో ఉబికి వస్తుంది.
హృదయాన్ని సంభ్రమాశ్చర్యాలలో
ముంచెత్తుతుంది.
4. ఇక నాలుగవ పాదం రూబాయిలోనే అతి ప్రధాన భాగం. ఇందులో పై మూడు పాదాల సారం ఇమిడి ఉంటుంది. మొదటి పాదంలో అంకురించిన భావం సమగ్రంగా గుబాళిస్తుంది.ఈ ముగింపులోనిదే
కవి ప్రతిభ,చమత్కృతి,ప్రౌఢిమ ప్రస్ఫుటం అవుతాయి. అందులో మన కవి గారు ఏనుగు నరసింహారెడ్డి గారు వంద శాతం నెగ్గారు.
తెలుగులో తొలి గజళ్లను, తొలి రుబాయిలను రాసిన వారు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యుల వారు. దాశరథి గారి తరువాత పట్టుదలతో తెలుగు రు బాయిలను రాసి అనేక సంపుటాలను ప్రచురించిన వారు డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్యులు గారు. దాశరథి, తిరుమల శ్రీనివాసాచార్య గార్ల తరువాత అధిక సంఖ్యలో రుబాయిలను రాసిన వారు ఏనుగు నరసింహారెడ్డి.
తెలంగాణ సాహిత్యంలో ఉర్దూ, ఫారసీ భాషల ప్రభావం అధికంగానే ఉంటుంది. ఇక్కడి వాళ్లకు గజల్, రుబాయి ఖసీదా,మర్సియా, మస్నవి మొదలైనవి పరిచయమే! అందుకే డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు
*"ఇచట తెల్గుల వాణి ఇచట ఉర్దూబాణీ కలిసిపోయినవి ముక్తా ప్రవాళములట్లు"**
అన్నారు. అందువల్ల ఏనుగు నరసింహారెడ్డి రుబాయిలు రాయడం ఈ నేల స్వభావంలో భాగం. కాబట్టి నరసింహారెడ్డిని కవి అనకుండా *షాయర్* అనవచ్చు. వీరు రాసిన రూబాయిల్లో అక్కడక్కడ కొన్ని ఉర్ధూ మాటలను రదీఫులుగా పెట్టుకున్నారు కూడా.
ఉదా:
*ఏదంటే అదయిద్ది పాబందుంటే*
*ఎప్పుడంటే అప్పుడయిద్ది పాబందుంటే*
*మాట మీద నిలబడటం చాలా కష్టం*
*ఆత్మబలం వృద్ధయిద్ది పాబందుంటే**
ఇందులో అదయిద్ది, అప్పుడయిద్ది, వృధ్ధయిద్ది అనేవి ఖాఫియాలు, పాబందుంటే అనేది రదీఫ్. ఒకటి, రెండు, నాలుగు పాదాలకు ఈ ఖాఫియా, రదీఫ్ లు తప్పకుండా ఉండాలి. ఇవి తెలుగులో అంత్యప్రాసల లాంటివి కావు. మూడవ పాదం స్వతంత్రంగా ఉంటుంది. దానికి రదీఫ్, కాఫీయాల పాబంది ఉండదు. కానీ ఈ ఒకటి, రెండు, నాలుగు పంక్తులను అనుసంధానించేది మూడవ పంక్తి. దానితో కలుపుకుని చూస్తే రుబాయి నాలుగో పాదం త కలుక్కుమని మెరుస్తుంది. ఉర్దూ మాటలతోనే కాకుండా నికార్సైన తెలంగాణ మాటలను కూడా ఈ కవి రదీఫ్ ఖాఫీయాలుగా వాడుకున్నారు.
*వాడకుంటే గండ్రగొడ్డలి మొండి వార్తది*
*దూయకుంటే విచ్చు కత్తి మొండి వార్తది*
*సాధనొకటే సకల కళలకు మూలశక్తి*
*రాయకుంటే పదునుపాళీ మొండి వార్తది*
ఈ రుబాయిని చదివినప్పుడు నా భవిష్యత్తు గుర్తుకు తెచ్చారు కవిగారు. ఇక్కడ గొడ్డలి , కత్తి, పాళి ఇకారాంత హల్లులు- ఖాఫీయాలు అయితే; మొండివార్తది అనేది రదీఫ్. రుబాయి అనగానే తటాలున గుర్తుకు వచ్చే పేరు *ఉమర్ ఖయ్యూం.* రాశిలో చాలా తక్కువ రాసినా వాసిలోఎంతో గొప్పవి ఆ రుబాయిలు.
వాటిని కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారు తెలుగులో అనువాదం చేసినారు.. యాదృచ్ఛికంగానే ఉన్నా వారు కూడా రెడ్డి గారు కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. రామిరెడ్డి గారు ఉమర్ ఖయ్యూం రుబాయిలను పానశాల పేరుతో ప్రచురించారు.
తెలంగాణ రుబాయిల గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన హజ్రత్ అమ్జద్ *హైదరబాదీ* రుబాయిలను తలుచుకోవడం అనివార్యం.
*జిల్లా అమర్ మె చాలా ముఝే మామూన్ కియా*
*మస్రూర్ కబీ,జార్ కబీ రంజూర్ కియా*
*మై ఖుద్రత్ క కభీన భాషలు హాలూ*
*లేకిన్ మజ్భూరియోంనే మజ్భూర్ కియా*
అలాగే తెలియదు అనే దానికి హజ్రత్ అమ్జద్ గారు "ఖుదాకీమర్జీ" అన్నారు. మన వేదాంతంలోనూ ఇది వున్నది. సంస్కృతంలో "తేనవినాతృణ మపినచలతి" అంటే అతని ఆజ్ఞ లేనిదే గడ్డి పోచ కూడా కదలదు అని. హజ్రత్ అమ్జద్ గారు అన్నది!
"*తఖ్ధీర్ సెగిలాక్యా ఖుదాకీ మర్జీ*
*జోకుచ్భీహువాహువాఖుదాకీమర్జీ*
*అమ్జద్ హర్ బాత్ మే కహాతక్ క్యోంక్యుం*
*హర్ క్యూమ్ కి హై ఇస్తే హాఖుదాకి మర్జీ*
అలాగే పుట్టడం మన చేతిలో లేదు. చావాలనుకుంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. కానీ ఎప్పుడో అప్పుడు పోక తప్పదు. ఇటువంటి ఒక రుబాయీలో అమ్జద్ ఇలా అన్నారు.
*కిస్ మతన్ కి తఫ్సీర్ హూ మాలూమ్ నహీ*
*కిస్ హాత్ కి తహ్రీర్ హూ మాలూమ్ నహీ*
*మై హూ కె మేరే ప్రదేశ్ మే హై ఔర్ కోయి*
*సూరత్ హూ కె తస్వీర్ హూ మాలూమ్ నహీ*
పైన తఫ్సీర్, తస్వీర్ అనేవి ఖాఫీయాలైతే మాలూమ్ నహీ అనేది రదీఫ్. ఇలాగే నరసింహారెడ్డి గారు తెలియదు అని ఇటువంటి సూఫీ భావం గల రుబాయీని రాసారు.
*అతడు ఎక్కడున్నాడో నాకు తెలియదు*
*మనం ఎక్కడున్నామో సైతము తెలియదు*
*వాడు తెలుసంటాను వీడు తెలుసంటాను*
*ఇంతకు నేనెవడనో ఇప్పటికీ నాకు తెలియదు*
ఇందులో *అతడు* అంటే భగవంతుని గురించి చెప్పడం అన్నమాట. నిరాకారుడు, నిర్గుణుడు అయిన ఆ చిదానంద స్వరూపున్ని గురించి చెప్పేది, ఇక్కడ అతడు, వాడు, అన్ని సర్వనామాలే వున్నాయి. ఇవి మనం ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం అవుతాయి. అతడు - పరమాత్మ, నేను అనేది- జీవాత్మ . జీవాత్మ పరమాత్మ లో కలిసి పోవడానికి తహతహలాడుతుంది.
అతడెక్కడున్నాడో తెలియదు, ఇంతకీ *నేనెవరిని* అనే ప్రశ్నకు జవాబు లేదు. నిజమే కదా! తెలియదు. అందుకే *అహం బ్రహ్మాస్మి* అనే మహా వాక్యానికి మూలం.
వైవిధ్యాన్ని, సౌందర్యాన్ని దర్శింపజేసే రూపంగా రుబాయిలకు పేరుంది. తెలుగు రుబాయిల ప్రయోక్తగా మహాకవి దాశరథి ప్రసిద్దులయ్యారు. ఆ పరంపరలో ఎందరెందరో కవులు రుబాయిలను రాశారు. మనకు మూల మలుపులో మిణుకు మిణుకు మనే జ్ఞాపకాన్ని పలకరించి స్పర్శించిన అనుభూతిని డా ఏనుగు నరసింహారెడ్డి గారు ఆలోచనాత్మకమైన తెలంగాణ రుబాయిలుగా మలిచారు. కవి సునిశిత, కవిత్వ గుణానికి ఒక్కోరుబాయి ప్రాతినిధ్యం వహించింది.
నరసింహారెడ్డి గారి రూబాయిల్లో తెలంగాణ తనం ఉంది, తెలంగాణ భాష ఉంది. తెలంగాణ జన సామాన్యం వాడుకునే చాలా పదాలు ఉన్నాయి. వారు ఈ రుబాయిలు రాసే నాటికి తెలంగాణా రాష్ట్రం కోరి ఉద్యమం నడుస్తున్నది. వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత కోరి కూడా రుబాయిలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రచనలు చేసిన వందలాది, వేలాదిమంది కవులు ఉన్నారు తెలంగాణ లో. ఆ త్రోవలో నరసింహారెడ్డి గారు కూడా ఒకరు. వారు ఈ రుబాయిలకు *తెలంగాణ రుబాయిలు* అనే పేరు పెట్టింది ఇందుకోసమే.
ఎవరో నొచ్చుకుంటారు అని కవి కవితలు రాయకుండా ఉండడు. కొందరి మెప్పు కోసమని మాత్రమే కావాలని నిజమైన కవి రాయడు. ఒక సత్యాన్ని ఆవిష్కరింప చేయడమే కవిత్వం పరమ ప్రయోజనం. అందుకే నరసింహారెడ్డి గారు ఒక రుబాయిలో ఇలా అంటారు!
*అపుడెపుడో అన్నామని మనసులో పెట్టుకోకు*
*ఏదేదో విని ఉంటావ్ మది లోపల పెట్టుకోకు*
*చెప్పిన వన్నీ క్షమించేటి రోజొకటి రానున్నది*
*రాలే పూలమే మనం మనసు కష్టపెట్టుకోకు.*
రుబాయిలు రాసి మెప్పించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ అందులో సఫలీకృతుడయ్యాడు నరసింహారెడ్డి.
ఈ తెలంగాణ రూబాయిల్లో 536 రుబాయిలు ఉన్నాయి. అందులో కొన్ని ముత్యాలు, కొన్ని రతనాలు, కొన్ని వజ్రాలు, కొన్ని వైడూర్యాలు, కొన్ని మరకతాలు, మరికొన్ని మాణిక్యాలు. ఏకంగా 300పేజీల విలువైన గని ఇది!
ఇవి చదువుతున్నంత సేపు మనల్నిమనంచదువుకోవచ్చు.
శాస్త్ర సాంకేతికత పెరిగిన కొద్దీ మనిషికి- మనిషికీ మధ్య అంతరం పెరుగుతుంది. పెరగాల్సింది అంతరం కాదు, మానవ సంబంధాల గాఢత అని చెప్తూ ఇలా అంటారు.
*మనిషిని గాయపర్చకు మళ్ళీ కలువలేం*
*నీతిని పాతరేయకు మళ్ళీ కలువలేం*
*ప్రేమించడం లో మునిగిపో ద్వేషించలేం*
*కరుణను జారవిడువకు మళ్ళీ కలువలేం*
నాగరికత నిర్మాణంలో మనిషి- మరో మనిషితో కలిస్తేనే ఇంత దూరం ప్రయాణం జరిగింది. లేకపోతే నవ నాగరికత నిర్మాణం జరిగేది కాదు అంటారు, రెడ్డి గారు.
అక్షరాస్యత పెరుగుతున్న కొద్దీ అవినీతి పెరగటం ఆందోళన కలిగించే విషయం. మానవ సంబంధాలు నీతి నిజాయితీ పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి నీతిని పాతరేస్తే - మానవ సంబంధాల మనగుడే కష్టం అని అంటారు మరో చోట.
*శిలలన్నీ శిథిలమౌను- శిలకీర్తియే నిలుచు*
*కమ్మలెల్ల జీర్ణ మౌను- కావ్యావనియే నిలుచు*
*కుడి యెడమలకు చూడకుండా పరుగెత్తును కాలఝరి*
*ఆటుపోటులుంటైగని మంచి తామే నిలుచు*
ఈ వాక్యాల్లో నాకు జాషువా గారి ఫిరదౌసి కావ్యం లోని మాటలు గుర్తుకొచ్చినయ్
*రాజు మరణించు నొకతార రాలిపోయె*
*కవియు మరణించు నొకతార గగనమెక్కే*
*రాజుజీవించు రాతి విగ్రహముల యందు*
*సుకవి జీవించు ప్రజల నాలుకల యందు*
అన్నట్లు శిలలు కాలక్రమేనా శిథిలం అవుతాయి. కానీ శిల్పి- శిల్ప నైపుణ్యం శిథిలం కావు అంటారు.
వైవిధ్య భరితం అనుభూతుల మాల అయి మన మనస్సుల్లో ఏనుగు నరసింహారెడ్డి గారు ఈ *తెలంగాణ రుబాయిలు* జీవనదిలా ప్రవాహమై సాగుతుూనే ఉంటాయి.
నరసింహారెడ్డి గారు మంచి వచన కవి, పద్య కవి, వ్యాస కర్త మరియు అనువాదకులు కూడా.
తెలంగాణ రుబాయిలు నిండైన, నికార్సైన తెలంగాణా మట్టి వాసన చూసిన, ఆస్వాదించిన గ్రంథము. పుస్తకం ఆ మూలాగ్రం మనిషి జీవిత కాలంలో చూసిన, ఎదుర్కొన్న ఘటనలు, సన్నివేశాలు, జీవన చిత్రణ కండ్లకు కట్టినట్లుగా రాసి చరితార్ధులు అయ్యారు. వారు మరిన్ని రచనలు చేసి ఉన్నతోన్నత స్థానాన్ని చేరుకోవాలని పాఠకులుగా మనందరం కోరు కోవడం అనివార్యం.
*ఆధార గ్రంథాలు*
1.తెలంగాణ రుబాయిలు (ఏనుగు నరసింహారెడ్డి)
2. పానశాల (దువ్వూరి రామిరెడ్డి)
3. దాశరధి రుబాయిలు- గజల్లు (డాక్టర్ తిరుమల
శ్రీనివాసాచార్య)
4. ప్రపంచపదులు (డాక్టర్ సి నారాయణ రెడ్డి)
10 October 2024
06 October 2024
05 October 2024
Greetings from UGC-MMTTC, MANUU!* This is to inform you that the *UGC-Malaviya Mission Teacher Training Centre* (formerly known as UGC-HRDC), Maulana Azad National Urdu University is organizing *NEP Orientation and Sensitization program* from *07/10/2024 to 16/10/2024* for all the eligible faculty members of Colleges and Universities to be held from 2:00 pm to 5:15 pm online*
There is NO REGISTRATION Fee.
Only 200 participants per programme on a first-come-first-serve basis.
Participants should register for the course by clicking on the link:
https://forms.gle/Kmm2pR1pVKd7iFL99
Thanks & Regards
Director, UGC-MMTTC,
Maulana Azad National University,
Gachibowli, Hyderabad
03 October 2024
28 September 2024
కాలేజి పోరడంటే కాసు గీటు వీడు, ముచ్చటైన మొనగాడు ముత్యమంటివాడు ఇంటికెళ్లి బతిమాలితే కానీ, ఇటువైపుకు చూడడు అడిగినన్ని వాటికి ఔనంటే గాని అసలిక్కడ చేరడు ll
కాలేజి పోరడంటే కాసు గీటు వీడు,
ముచ్చటైన మొనగాడు ముత్యమంటివాడు
ఇంటికెళ్లి బతిమాలితే కానీ,
ఇటువైపుకు చూడడు
అడిగినన్ని వాటికి ఔనంటే గాని అసలిక్కడ చేరడు ll
ప్రతిరోజూ రమ్మంటే కుదరనే కుదరదు
హాజరు ఫుల్లుగ ఇవ్వకుంటే నడవదు
ఎప్పుడంటే అప్పుడు లోనికిరానియ్యాలి
లేటు ఎందుకయ్యిందని నిలదీయ కూడదుll
మాటవరసకైనా ఫీజు మాట ఎత్తరాదు
స్కాలర్షిప్ లో మాత్రం రూపాయీ తగ్గరాదు
యూనిఫారంలో రమ్మని ఇబ్బంది పెట్టరాదు
చిరుగుల జీన్సు కసలు నో చెప్పనే చెప్పరాదుll
మీ పాటికి మీరు, చెప్పుకు పోవాలి తప్ప
ఏ నాడు మమ్మల్ని ప్రశ్నలు అడగరాదు
టెస్టులని మిడ్లు అని హింసించరాదు
మార్కులని, గ్రేడులని మనసు బాధపెట్టరాదు ll
అమ్మాయిలనేమన్నా అడ్డు చెప్పరాదు
అల్లరెంత చేసినా అదుపు చేయరాదు
సెల్ ఫోనులు తేవద్దని సూక్తి చెప్పరాదు
అవధి లేని అంతర్జాలం హక్కుగా ఇవ్వాలి ll
ఆటలకు పాటలకు అధిక సమయమివ్వాలి
పార్టీలకు మ్యాట్నీలకు పర్మిషన్లు ఇవ్వాలి
ఫంక్షన్లకు స్టేజీపైన గంతులెయ్యనియ్యాలి
ఏమున్నా లేకున్నా పరీక్షకి పంపించాలి
పాసైనా ఫెయిలైనా ప్లేస్ మెంటు చూపాలిll
రచన: టీ.యస్.వి.పద్మనాభం
24 September 2024
21 September 2024
For Faculty Members https://forms.gle/2xGXWJJbHFLKizdb9
For Research Scholars https://forms.gle/6k9kcSZDQjTYEefJ9
18 September 2024
15 September 2024
14 September 2024
one-day National workshop on "Basics and Advances in Plant Taxonomy & Herbarium Preparation Techniques" Wein collaboration with Botanical Survey of India, CNH, Howrah & DRC Hyd , the Department of Botany Government City College ( A) Nayapul, Hyderabad on September 20th 2024,
A one-day National workshop on "Basics and Advances in Plant Taxonomy & Herbarium Preparation Techniques"
Dear All Botanists, I am happy to inform you that
the Department of Botany Government City College ( A) Nayapul, Hyderabad
organizing a one-day National workshop on "Basics and Advances in Plant Taxonomy & Herbarium Preparation Techniques"
Wein collaboration with Botanical Survey of India, CNH, Howrah & DRC Hyd
on September 20th 2024,
to learn, recollect, experience, and expertise in advanced techniques.
I am inviting all the Botany students and faculty from All the Institutions. students & faculty from each college, interested botanists give the names. Scientists from BSI will provide a great experience in taxonomy and Herbarium Preparation,
Only limited persons are allowed. First come first serve, utilize the opportunity.
Registration Link: https://docs.google.com/forms/d/10SB82aSt1enqehTR4hn3kol9wKITvAY_PpCE2HpM_yk/edit?chromeless=1
Organizing Secretary*
Dr D Nagaraju,
HoD Botany,
Govt.City College ( A) Nayapul, Hyderabad, TG
9052754439, 9494317649, 9441735838
botanygcchyd@gmail.com, drnr123@gmail.com
Co-Chairman
Dr.L.Rasingam
Incharge/ Scientist - E
Botanical Survey of India
Deccan Region Centre, Hyderabad
Chairman
Prof.P.Balabhaskar
Principal
Govt.City College ( A) Nayapul, Hyderabad,TG